ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి దాసోహం: అశోక్‌బాబు

By

Published : Jan 23, 2021, 7:07 PM IST

ఉద్యోగ సంఘ నేతల భాష దారుణంగా ఉందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. తాము చనిపోయే పరిస్థితి వస్తే చంపేందుకు సిద్ధమని ఎలా అంటారని దుయ్యబట్టారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగులు ఎలా చెబుతారని నిలదీశారు.

tdp mlc ashok babu
tdp mlc ashok babu

రాష్ట్రంలో ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి పూర్తిగా దాసోహమయ్యారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఉద్యోగ సంఘ నేతల భాష దారుణంగా ఉందన్న ఆయన... తాము చనిపోయే పరిస్థితి వస్తే చంపేందుకు సిద్ధమని ఎలా అంటారని దుయ్యబట్టారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక అందరూ ఈసీ పరిధిలోకి వెళ్తారని గుర్తు చేశారు. ఉద్యోగులు లేనిపోని ఉత్సాహంతో పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలంటే రెండేళ్లు పడుతుందని అశోక్ బాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details