ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రిని కలిసిన తెదేపా నేతల బృందం

తెదేపా నేతల బృందం.. కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రిని కలిసింది. వెలుగొండ ప్రాజెక్టును గెజిట్​లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.

By

Published : Aug 31, 2021, 2:00 PM IST

tdp
tdp

వెలుగొండ ప్రాజెక్టును గెజిట్​లో చేర్చాలని ప్రకాశం, నెల్లూరు తెదేపా నేతల బృందం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్​షెకావత్​ను కోరారు. తెదేపా నేతల బృందం దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ప్రకాశం జిల్లా కరువు పరిస్థితిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించారు. ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్​తో పాటు నాయకులు సాంబశివరావు, జనార్దన్, ఉగ్రనరసింహా రెడ్డి కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details