Chandrababu: వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నవారు.. వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదని, రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయన్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి అని ఆక్షేపించారు. విట్, ఎస్ఆర్ఎం సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తమ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు...కానీ అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని చంద్రబాబు హితవుపలికారు.
Chandrababu: "వ్యక్తులపై కక్షతో జగన్... వ్యవస్థలను నాశనం చేస్తున్నారు"
Chandrababu: వ్యక్తులపై కక్షతో జగన్... వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మొదటి నుంచి జగన్ ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో... వ్యవస్థలను నాశనం చేయకూడదని హితవు పలికారు.
"అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదు. రాష్ట్రంలో సీఎం జగన్... మొదటి నుంచి ఇదే చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం, మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి ఆయా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు...కానీ అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇటువంటి ఆలోచనలు రాష్ట్రానికి కూడా గౌరవం కాదు." -చంద్రబాబు
ఇవీ చదవండి: