ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2021, 7:57 PM IST

ETV Bharat / city

కొవిడ్ బాధితుల కోసం 126 ఆస్పత్రులు, 17 వేల పడకలు సిద్ధం

వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా 126 ఆస్పత్రులు సిద్ధం చేసినట్లు చెప్పారు.

beds and hospitals ready for covid patients, covid mitigation arrangements in ap
కరోనా రోగుల కోసం ఏర్పాట్లు పూర్తి, కొవిడ్ బాధితుల కోసం రాష్ట్రంలో ఆస్పత్రులు, పడకలు సిద్ధం

కరోనా మలిదశ కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పడకలు సిద్ధం చేసినట్లు.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకించి 126 ఆస్పత్రులు సిద్ధం అయ్యాయని ఆయన తెలిపారు. వీటిలో 2 వేలకు పైగా వెంటిలేటర్లనూ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ ఆస్పత్రులను గుర్తించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'రెమ్డె​సివిర్​ను బ్లాక్​లో అమ్మితే కఠిన చర్యలే'

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 7,535 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని శ్రీకాంత్ వివరించారు. 35,465 మంది హోమ్ ఐసోలేషన్​లో వైద్య సేవలు పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 1,686 మంది కొవిడ్ కేర్ కేంద్రాల్లో.. 3,665 మంది వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details