ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ మద్దతు

నిబద్ధత గల పౌరుడిగా అమరావతి రైతుల పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్​ఎస్​ఎస్​ ప్రతినిధి రతన్ శారద అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఏపీలో రాజకీయ కక్షసాధింపు పాలన సాగుతోందని శారద విమర్శించారు.

By

Published : Jul 4, 2020, 2:31 PM IST

Updated : Jul 4, 2020, 3:33 PM IST

రతన్ శారధ
రతన్ శారధ

నిబద్ధత గల దేశ పౌరుడుగా అమరావతి పోరాటానికి మద్దతు తెలుపుతున్నానని ఆర్.ఎస్.ఎస్. ప్రతినిధి రతన్ శారద అన్నారు. అమరావతి రైతుల ఆందోళన 200వ రోజులకు చేరిన సందర్భంగా...ఆన్​లైన్​ ద్వారా ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాలని రతన్ శారద స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో క్రైస్తవ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. తిరుపతి భూములు, ఆస్తులను స్వాహా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు పాలన సాగుతోందని రతన్‌ శారద విమర్శించారు.

ఇదీ చదవండి :3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట: చంద్రబాబు

Last Updated : Jul 4, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details