ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2022, 6:03 AM IST

ETV Bharat / city

పాత వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్‌ ఫీజుల బాదుడు

రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన రవాణా, వ్యక్తిగత వాహనాల పునరుద్ధరణ రిజిస్ట్రేషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ రవాణాశాఖ ఆదేశాలు జారీచేసింది. దీనిని ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయాలంటూ రవాణాశాఖ కమిషనర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Re-registration
Re-registration

రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన రవాణా, రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాల పునరుద్ధరణ (రెన్యువల్‌) రిజిస్ట్రేషన్‌ ఫీజులను భారీగా పెంచుతూ రవాణాశాఖ ఆదేశాలు జారీచేసింది. అలాగే గతంలో లేని విధంగా ఇకపై సామర్థ్య (ఫిట్‌నెస్‌) పరీక్ష చేసినందుకు ఫీజు వసూలు చేయనున్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల రెన్యువల్‌ ఫీజులను పెంచుతూ కేంద్రం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేయగా, దీనిని ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయాలంటూ రవాణాశాఖ కమిషనర్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details