ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2020, 8:00 PM IST

ETV Bharat / city

సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పండగ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపినా.. అవి సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

Pongal festival rush in secundrabad
సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో సంక్రాంతి పండగ రద్దీ

సంక్రాంతి పండగ సందర్భంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. బెర్తుల్లో సీట్లు దొరక్క... సామానులు పెట్టుకునే బోగీల్లోనూ ప్రయాణికులు వెళుతున్నారు. పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 408 ప్రత్యేక రైళ్లు, 61 జన్​సాధారణ్, 31 సువిధ రైళ్లు నడిపినప్పటికీ సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రత్యేక రైళ్లలో ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ ఇతర అంశాలపై సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో సంక్రాంతి పండగ రద్దీ

ఇవీ చూడండి: ఇకపై సీఆర్డీఏ ఉండదా..?

ABOUT THE AUTHOR

...view details