ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 6, 2021, 9:18 PM IST

ETV Bharat / city

తేజస్విని కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలి: పవన్‌

ప్రభుత్వ వైఖరి వల్లే గుంటూరు బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఫీజు బకాయిలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు.

Pawan Kalyan responds to Guntur B.Tech student suicide
తేజస్విని కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలి: పవన్‌

గుంటూరు బీటెక్‌ విద్యార్థి తేజస్విని ఆత్మహత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పవన్ ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పరీక్షలు రాయనివ్వడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. మరణించిన తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని పవన్‌ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వైకాపా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది: నక్కా ఆనంద్ బాబు

ABOUT THE AUTHOR

...view details