ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్త ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషీయో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు.

By

Published : Nov 16, 2020, 10:02 AM IST

mlcs-
mlcs-

తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీలుగా బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ గుప్తా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిమండలి సిఫార్సు మేరకు ఈ ముగ్గురి నియామకానికి ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు.

రాష్ట్ర శాసనమండలిలో ఎన్నికైన తొలి ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న గుర్తింపు పొందగా... ఈయన నియామకంతో మండలిలో ఎస్​సీ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. సారయ్య నియామకంతో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య తొమ్మిదికి చేరింది. మండలిలో తొలి ఆర్యవైశ్య సభ్యునిగా దయానంద్‌ గుర్తింపు పొందారు.

ఈ ముగ్గురు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జీహెచ్​ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు. నూతన ఎమ్మెల్సీల నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయినట్లైంది. తెరాస నుంచి 35 మంది, మజ్లిస్‌ రెండు, ఉపాధ్యాయ, కాంగ్రెస్‌, భాజపా నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి :

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details