ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సరైన వివరణ ఇవ్వకపోతే.. తగిన ఆదేశాలు ఇస్తాం'

By

Published : Jan 18, 2021, 1:53 PM IST

ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ తీర్పును ధిక్కరించి.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సాగిస్తోందన్న పిటిషన్​పై... జాతీయ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్.. విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.

ngt
జాతీయ హరిత ట్రిబ్యునల్

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్​ విచారణ చేపట్టింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును ధిక్కరించి ప్రాజెక్టు పనులు సాగిస్తున్నారని.. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి సమాధానం ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సాగిస్తున్నారని పిటిషనర్​ పేర్కొన్నారు. పిటిషన్​పై జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్​పర్ట్ మెంబర్ సైబర్ దాస్ గుప్త బెంచ్ విచారణ చేపట్టింది.

ఎటువంటి అనుమతులు లేకుండానే.. పేలుళ్లకు పాల్పడి పర్యావరణ ఉల్లంఘన చేస్తున్నారని ట్రిబ్యునల్​కు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. కేవలం డీపీఆర్ రూపొందించటానికి అవసరమైన పరీక్షలు తప్ప.. ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వివరణను త్వరలోనే అందిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తెలిపారు.

ఎన్జీటీకి వివరణ ఇవ్వకుండా పనులు చేపట్టడం భావ్యం కాదని ట్రిబ్యునల్ ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్జీటీ బెంచ్ విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆమోదయోగ్యంగా లేకపోతే.. తగిన ఆదేశాలు ఇస్తామని జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో ఎన్జీటీ బెంచ్ హెచ్చరించింది.

ఇదీ చదవండి:

పాఠశాల్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details