ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 22, 2019, 9:58 PM IST

ETV Bharat / city

'సీఎం... నోరు విప్పండి... రాజధాని తరలిస్తున్నారా?'

అమరావతి నిర్మాణంపై సీఎం జగన్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్​లో ప్రశ్నలు సంధించారు. రాజధాని తరలించే ప్రయత్నాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై సీఎం వైఖరేంటో వైకాపా నాయకులకూ తెలియక రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

నోరు విప్పండి సీఎం సార్... రాజధాని తరలిస్తారా : లోకేశ్

లోకేశ్ ట్విట్

అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద అసలు ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. రాజధానిని ఇంకెక్కడికైనా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అని నిలదీశారు. అమరావతిలో భవనం కట్టుకున్న జగన్‌... రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా అని లోకేశ్‌ ప్రశ్నించారు. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని... ఇప్పుడు అమరావతి ఎడారిని తలపిస్తోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై అధ్యక్షుడి వైఖరి ఏమిటో తెలియకవైకాపా నాయకులు రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details