నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు. అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన హరికృష్ణ జ్ఞాపకాలను, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవను చంద్రబాబు స్మరించుకున్నారు. కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ల ముందు ఉంచుతుందని లోకేశ్ అన్నారు.
నందమూరి హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్ నివాళి
అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అని తెదేపా నాయకులు చంద్రబాబు, లోకేశ్లు కొనియాడారు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
Nandamuri Harikrishna Jayanti