ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 18, 2020, 9:55 PM IST

ETV Bharat / city

వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

tirumala navaratri brahmotsavalu 2020
tirumala navaratri brahmotsavalu 2020

వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు రాత్రి ముత్యపుపందిరి వాహనంపై అమ్మవార్లతో కలసి స్వామివారు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు రుక్మిణి స‌త్య‌భామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కళ్యాణ మండపంలో కొలువుతీర్చిన వాహన సేవలో అర్చకులు నక్షత్ర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానంను శాస్తోక్తంగా చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details