ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR on president rule: ఆంధ్రప్రదేశ్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలి : రఘురామ

RRR on president rule : ఆంధ్రప్రదేశ్​లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభలో కోరారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు.

By

Published : Dec 13, 2021, 2:48 PM IST

RRR on president rule
RRR on president rule

RRR on president rule: ఆంధ్రప్రదేశ్​లో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన విధించాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభలో కోరారు. 377 నిబంధన కింద.. లోకసభలో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించారు.

రుణాలు పొందడానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక.. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన ప్రభుత్వం రుణాలు తీసుకుందని అన్నారు. రాష్ట్రం ఒకరకంగా.. ఆర్థిక దివాళా పరిస్థితికి చేరుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Vidhya deevena: విద్యాదీవెనపై ప్రభుత్వ రివ్యూ పిటిషన్ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details