తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు.
''ఇటీవల ఆర్థిక మంత్రులకి మీటింగ్ అయ్యింది. మీకు రూ.2,500 కోట్లు కావాలంటే... బావులు, బోర్ల వద్ద మీటర్లు పెట్టండి అన్నారు. పెట్టాల్నా మరీ..? పెట్టి 2,500 కోట్ల రూపాయలు తెచ్చుకోవాల్నా? అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి రూ.4,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. పోయిండు. నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నాడు. మీటర్లు పెడుతున్నాడు.''