ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2020, 1:12 PM IST

ETV Bharat / city

అమరావతిపై ఉన్న అపోహలు తొలగించే కథనం: లోకేశ్

అమరావతిపై ఉన్న అపోహలను తొలగించేలా ఓ ఆంగ్లపత్రిక విశ్లేషణ ఉందని లోకేశ్ అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుపై ఆ పత్రిక రాసిన కథనాన్ని ట్విటర్లో లోకేశ్ ప్రస్తావించారు.

lokesh on amaravathi
లోకేశ్

మూడు రాజధానులు ఏర్పాటు చేయడం.. రాష్ట్రానికి శాపమంటూ ప్రముఖ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్​‌ ట్వీట్‌ చేశారు. ఏ ప్రాంతమైనా ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు, మార్కెట్‌ అనుసంధానత ఉంటేనే అభివృద్ధి జరుగుతుందే తప్ప.. ప్రభుత్వ కార్యాలయాలను తరలించినంత మాత్రాన కాదు అని సదరు ఆంగ్ల పత్రిక పేర్కొంది. అమరావతికి ఘనచరిత్ర ఉందని.. రాజకీయ కోణంలో సీఎం ప్రతీకారం తీర్చుకుంటున్నారని వెల్లడించింది. అమరావతిపై ఉన్న అపోహలను తొలగించేలా ఈ విశ్లేషణ ఉందని లోకేశ్​‌ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details