ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2022, 9:36 AM IST

ETV Bharat / city

'ఆ సినిమాలు చూసి.. అందరం అనుకునే రేప్​ చేశాం'

jubilee hills rape case: జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో మరింత కీలక సమాచారం సేకరించారు పోలీసులు. మైనర్లను కస్టడీలో తీసుకున్న పోలీసులు పీఎస్​లో విచారణ చేపట్టారు. ఈ విచారణలో మైనర్లు విస్తుగొలిపే విషయాలను వెల్లడించారు. ఇంతకీ నిందితులు పోలీసులతో ఏం చెప్పారంటే..!

1
1

jubilee hills rape case: రాష్ట్రంలో సంచలనం సృష్టంచిన జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మైనర్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందరూ పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లు పోలీసులకు తెలిపారు.

‘‘పరీక్షలు పూర్తయినప్పట్నుంచి ఖాళీగా ఉన్నాం. దాదాపు ప్రతిరోజూ పబ్బులకు వెళ్తున్నాం. పార్టీల్లో కలుసుకుంటున్నాం. ఆ రోజు(మే 28, 2022) అమ్నీషియా పబ్‌కు వెళ్లాం. బాధిత బాలిక, మరో బాలికను పరిచయం చేసుకున్నాం. డేటింగ్‌కు వెళ్దామని అడగాలని అనుకున్నాం. వాళ్లు నవ్వుతూ మాట్లాడుతుండటం, పరిచయం చేసుకునే సమయంలో అమాయకంగా కనిపించడంతో ఇద్దర్నీ బయటకు తీసుకెళ్లి ఏదైనా చేద్దామనుకున్నాం. ఈ క్రమంలోనే వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు అసభ్యంగా ప్రవర్తించాం. వాళ్లు బయటకు రావడంతో మేమూ వచ్చేశాం. వారిలో ఓ బాలికను నమ్మించాం. అత్యాచారం చేయాలనుకున్నాం.. అందరూ అనుకునే ఇదంతా చేశాం. ఇంగ్లిష్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లో ఘటనలే మాకు ప్రేరణ’’ అని జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు విచారణలో పోలీసు అధికారులతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అత్యాచార ఉదంతంపై మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు పోలీసులు న్యాయస్థానం ఆదేశంతో మైనర్లను విచారిస్తున్నారు. నిందితులో ఒకరు నోరు విప్పకపోగా, మరో ఇద్దరు మాత్రం వివరాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. ‘మైనర్లమైనందున పబ్బుల్లో ప్రవేశం ఉండదు. అందుకే మేజర్లయిన స్నేహితులు పార్టీలు ఏర్పాటు చేస్తే పాల్గొని మేమే బిల్లు చెల్లిస్తామని’’ వారు చెప్పినట్టు తెలిసింది.

వేర్వేరు ప్రాంతాలు, కళాశాలల్లో చదువు:సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్కరిది మాత్రం సంగారెడ్డి జిల్లా. సాదుద్దీన్‌ మినహా మైనర్లంతా హైదరాబాద్‌ శివారులోని ఓ కార్పొరేట్‌ కళాశాల, అంతర్జాతీయ విద్యా సంస్థలో ఇంటర్‌ చదువుతున్నారు. ‘‘వీరందరికీ ఓ యువకుడు స్నేహితుడని, అతనే వీరిని పబ్బులు, పార్టీలకు తీసుకెళ్తున్నాడని’’ పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. అతడే వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు, పబ్బుల్లో పార్టీలు ఏర్పాటుచేసి మైనర్లను ఆహ్వానిస్తున్నాడనీ గుర్తించారు. పార్టీల్లో వీరంతా సిగరెట్లు తాగారని, మద్యం తాగుతున్నారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిసింది. ఈ కోణంలో విచారణాధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

సమాంతరంగా అభియోగ పత్రాలు:నిందితులను విచారిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు, అభియోగ పత్రాలు సమర్పించేందుకు వీలుగా వేగంగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోక్సో చట్టం ప్రకారం ప్రతి కేసులోనూ 60 రోజుల్లో అభియోగ పత్రాలు సమర్పించాలన్న నిబంధన ఉండటంతో అందులో పొందుపరచాల్సిన అంశాలపైనా దృష్టి కేంద్రీకరించారు. కోర్టు ఆదేశాలతో ముగ్గురు మైనర్లకు అయిదు రోజులు, మరో ఇద్దరు మైనర్లకు నాలుగు రోజుల కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం కస్టడీ ముగియడంతో సాదుద్దీన్‌ను కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details