ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2020, 4:46 PM IST

Updated : Jul 30, 2020, 5:04 PM IST

ETV Bharat / city

మిషన్ బిల్డ్ ఏపీపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో జరిగిన విచారణ నెల రోజులపాటు వాయిదా పడింది. ప్రభుత్వ భూములు అమ్మాలన్న నిర్ణయంపై పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

high-court-on-mission-build-ap
మిషన్ బిల్డ్ ఏపీపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలి

విశాఖపట్నం, గుంటూరుతోపాటు పలుచోట్ల ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన తోట సురేశ్ బాబుతోపాటు మరి కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఈ-టెండర్లను ఖరారు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Jul 30, 2020, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details