ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా సమయంలో మద్యం విక్రయాల'పై హైకోర్టులో వాదనలు

కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం తరఫు, పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

By

Published : Jun 23, 2020, 4:21 PM IST

high court hearings on liquor sales in corona time in state
'కరోనా సమయంలో మద్యం విక్రయాలపై' హైకోర్టులో వాదనలు

కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. మద్యం విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యంపై అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వ న్యాయవాది చదివి వినిపించారు. కొవిడ్ సమయంలోనూ ఆన్​లైన్​లో అమ్మకాలు చేపట్టవచ్చని సుప్రీం తీర్పునిచ్చింది. దాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు ముందుంచారు.

దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆ తీర్పు ఆంధ్రప్రదేశ్​కు వర్తించదని, రాష్ట్రంలో క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అయినప్పటికీ కరోనా సమయంలో అమ్మకాలు జరిపారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details