ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 12, 2021, 2:26 PM IST

ETV Bharat / city

AP - TS Boarder: రాష్ట్ర సరిహద్దు దాటుతున్నారా?.. ఈ విషయం మరిచిపోకండి!

ఏపీ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్‌ ఉన్న వాటికి మాత్రమే అనుమతిస్తూ.. లేని వాహనాలను తిప్పి పంపుతున్నారు.

heavy traffic
వాహనాల రద్దీ

వాహనాల రద్దీ

కొవిడ్​ ఉద్ధృతి తగ్గుతుండడంతో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కచ్చితంగా ఈ-పాస్‌ కలిగి ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేసి.. ఈ పాస్ ఉన్న వాటిని మాత్రమే అనుమతిఇస్తున్నారు. పాస్‌ లేని వాహనాలను తిప్పి పంపుతున్నారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details