బహిరంగ లేఖతో వైఎస్ విజయమ్మ బేలతనం బయటపడిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ విమర్శించారు. ‘‘లేఖతో పాటు తాడేపల్లి ప్యాలెస్కు ఏం సలహా ఇచ్చారో ఆమె బయటపెట్టాలి. మీరు తల్లిగా జగన్ను సరిచేయాల్సింది పోయి.. పుత్ర వాత్సల్యంతో పరనింద వేయడం సరికాదు. హత్యలో జగన్ ప్రమేయం ఉంటే.. విజయమ్మే నేరుగా సీబీఐకి అప్పగించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
విజయమ్మ బహిరంగ లేఖపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో కచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందేనని.. వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ బహిరంగ లేఖ విడుదలు చేశారు. దీనిపై మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత కేఎస్ జవహర్ విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్