ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

టాప్ టెన్ న్యూస్

By

Published : Jan 18, 2021, 9:00 AM IST

top ten news
ప్రధాన వార్తలు

  • పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఎస్ఈసీ జారీ చేసిన ప్రోసిడింగ్స్‌పై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం...హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్‌ విచారణ జరపనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నందమూరి తారక రామారావు.. కాషాయం కట్టిన లౌకికవాది

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజా జీవితంలోకి వచ్చినా.. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తిని, సమాఖ్య వ్యవస్థ అవసరాన్ని నొక్కిచెప్పి తనదైన ఒక సైద్ధాంతిక పునాదిని ఎన్టీఆర్‌ ప్రతిపాదించారు. రాజకీయాన్ని వృత్తిగా కాకుండా లక్ష్యసాధనకు మార్గంగా పరిగణించిన.. నందమూరి తారక రామరావు 25వ వర్థంతి నేడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒకరనుకొని మరొకరిపై కత్తితో దాడి.. చివరికి..!

గుంటూరు నగర శివారులో ఆదివారం ఉదయం చిత్రమైన ఘటన జరిగింది. మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా వెళ్తావా.. అంటూ ఒకతను వచ్చి తీవ్రంగా కొట్టాడు. తర్వాత కత్తితో పొడిచాడు.. మళ్లీ పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు వచ్చి చితకబాదారు.. చివరలో అరే నువ్వా.. నిన్ను కాదు కొట్టాల్సింది.. అంటూ సారీ చెప్పి చికిత్స కోసం రూ.వెయ్యి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అలిపిరి నడక మార్గంలో భక్తులను వెంబడించిన దొంగలు

అలిపిరి నడక మార్గంలో తమను దోచుకోవటానికి దొంగలు వెంబడించారని భక్తులు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే స్పందించి.. తమను రక్షించినట్లు భక్తులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహారాష్ట్రలో భూకంపం- భవనాలకు పగుళ్లు

మహారాష్ట్ర పాల్​గఢ్​లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'కరోనా సమయంలో నా భార్యకు ముద్దు కూడా పెట్టలేదు'

జమ్మూలో జరిగిన ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్​ అబ్దుల్లా.. తన ప్రసంగంతో సభలో నవ్వులు పూయించారు. మహమ్మారి భయంతో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. కొవిడ్-19వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. వ్యాక్సిన్ రావటంపై హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జవాన్ల ప్రాణాలకు శ్రీరామ రక్ష.. బైక్ అంబులెన్స్​

యుద్ధ రంగంలో గాయపడే భద్రతా సిబ్బంది అత్యవసర వైద్యానికి ఉపయోగపడేలా బైక్​ అంబులెన్స్​లను రూపొందించారు. సీఆర్‌పీఎఫ్, ఇన్మాస్, డీఆర్‌డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'రక్షిత'ను నేడు దిల్లీలో ప్రారంభించనున్నారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మన కమలకు రంగవల్లికలతో స్వాగతం

జో బైడెన్​, కమలా హారిస్​ల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు నూతన అగ్రరాజ్య పాలకులకు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. టైల్స్​పై అందమైన రంగవల్లికలు వేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. వాటిని వాషింగ్టన్​కు పంపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గబ్బా టెస్టు: 182 పరుగుల ఆధిక్యంలో ఆసీస్​

టీమ్​ఇండియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది. ​రెండో ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్​(28), గ్రీన్​(4) ఉన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రూపం మనోహరం.. అభినయం అనితర సాధ్యం!

తెలుగు తెరపై తన పేరును శాశ్వతంగా ముద్రించుకుని.. నట సార్వభౌముడిగా.. యుగపురుషుడిగా ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు వర్థంతి నేడు (జనవరి 18). ఈ సందర్భంగా ఎన్నో చిత్రాల్లో తన మరపురాని నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన గురించి ఓ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details