- గవర్నర్తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ సమావేశం
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. గవర్నర్తో సుమారు 40 నిమిషాలు భేటీ అయిన ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను గవర్నర్కు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫోన్ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...
ఫోన్ ఎక్కువగా చూస్తున్నాడని తండ్రి మందలించటం ఆ బాలుడికి నచ్చలేదు. తన తండ్రిని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దుకాణంలో పనిచేస్తున్న 17 ఏళ్ల గుమాస్తాతో కలిసి కిడ్నాప్ పేరిట డ్రామా ఆడాడు. అటు తల్లిదండ్రులను.. ఇటు పోలీసులను పరుగులు పెట్టించాడు. ఇంత చేసిన ఆ బాలుడి వయసు కేవలం 12 ఏళ్లే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జపాలీ తీర్థాన్ని దర్శించుకున్న సీఎం శివరాజ్సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ జపాలీ తీర్థాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో ఎన్నికలు వద్దంటున్నారు: యనమల
ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైకాపా వెనుకంజ వేస్తోందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైకాపా ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. బాధిత వర్గాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనేదే వైకాపా భయమన్నారు. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చూసే వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఖుష్బూకు తృటిలో తప్పిన ప్రమాదం
సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్ పూజ'