ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

By

Published : Oct 21, 2020, 1:01 PM IST

1 pm top news
1PM ప్రధాన వార్తలు

  • 'వైఎస్సార్‌ బీమా' పథకం ప్రారంభం

'వైఎస్సార్‌ బీమా' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.41కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు...హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం

తిరుమలలో ఆరో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... 10గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డోలీలో తీసుకొచ్చినా.. 108 అందుబాటులో లేక బాలింత మృతి

నెలలు నిండిన ఓ బాలింత.. వైద్యం అందక ప్రాణాలు వదిలింది. కొండలు దిగి, గుట్టలు మీదుగా డోలీలో బాధితురాలిని తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. సమయానికి 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంద్రావతి నదిలో పడవలు బోల్తా.. ఇద్దరు గల్లంతు

మహారాష్ట్ర ఇంద్రావతి నదిలో రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. 13 మందిని ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు రక్షించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సౌదీ యువరాజుపై ఖషోగ్గీ కుటుంబం పిటిషన్​

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్​ బిన్ సల్మాన్​పై అమెరికాలో పిటిషన్​ దాఖలైంది. సల్మాన్​ ఇచ్చిన ఆదేశాలమేరకే ఖషోగ్గీని అత్యంత కిరాతకంగా హతమార్చారని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జర్మనీ జీడీపీని దాటిన చైనా కుబేరుల సంపద

చైనా కుబేరుల సంపద కరోనా వైరస్​ సంక్షోభంలోనూ భారీగా పెరిగింది. ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకుడు జాక్​మా సంపద గత ఏడాదితో పోలిస్తే.. 45 శాతం పెరిగి 58.8 బిలియన్ డాలర్లకు చేరిందని ఓ నివేదిక వెల్లడించింది. దీనితో ఈయనే మరోసారి చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచినట్లు పేర్కొంది. చైనా సంపన్నుల మొత్తం సంపద 4 ట్రిలియన్ డాలర్ల మార్క్​ను దాటినట్లు నివేదిక వివరించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ' అందులో నేనే కింగ్​- లాబీయిస్టులకు బైడెన్​ సేవకుడు'

జో బైడెన్​కు సెప్టెంబర్​లో భారీగా విరాళాలు అందటంపై తీవ్ర విమర్శలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. లాబీయిస్టులు, అమెరికా సంపదను దోచుకునే రాబందులకు బైడెన్​ సేవకుడని ఆరోపించారు. విరాళాల సేకరణలో తానే కింగ్​ అని పేర్కొన్నారు. నవంబర్​ 3న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆస్ట్రేలియా పర్యటనకు భారత్.. కుటుంబాలకు నో ఎంట్రీ!

త్వరలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను అనుమతించకపోవచ్చు. అయితే మొత్తం పర్యటన కోసం దాదాపు 32 మందిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రాధేశ్యామ్' నుంచి సర్​ప్రైజ్.. ప్రభాస్ కొత్త లుక్

'రాధేశ్యామ్'లో విక్రమ్ ఆదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ మేరకు కొత్త లుక్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details