ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 Am

.

By

Published : Jul 8, 2020, 11:01 AM IST

11 am top news
11 Am ప్రధాన వార్తలు

1. ఆయన మరణం లేని మహానేత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఇడుపులపాయలోని వైఎస్​ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. జగన్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది

వైకాపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. సకాలంలో రైతులకు విత్తనాలు, రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. పోలీస్​స్టేషన్​కు ఎల్​జీ పాలిమర్స్ నిందితులు

ఎల్​జీ పాలిమర్స్ కేసు నిందితులను విశాఖ మూడో పట్టణ పీఎస్​కు తీసుకెళ్లారు. రాత్రి 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. వారు అడ్డుకున్నారు... వీరు పూర్తి చేశారు

కరోనాతో మృతి చెందిన వారి అంతిమసంస్కారాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొవిడ్​తో చనిపోయిన ఓ వృద్ధురాలు చనిపోతే, ఆమెను తమ స్థలంలో ఖననం చేయ్యెద్దంటూ పెద్ద ఎత్తున ఆ గ్రామ యువకులు ఆందోళన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కరోనా కోరల్లో భారత్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 22,752‬ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 482 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. దూబే ప్రధాన అనుచరుడు హతం

కాన్పూర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్​ వికాస్​ దూబే ప్రధాన అనుచరుడిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హతమార్చారు. వికాస్​ దూబే కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 28 పాయింట్లు నష్టపోయి 36 వేల 645 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 10 వేల 796 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. స్టాండింగ్ కమిటీ సమావేశం మళ్లీ వాయిదా

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ భవితవ్యంపై బుధవారం జరగాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది. ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలని పార్టీ సభ్యులే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. తడి తువాలు ఉత్తమం

క్రికెట్​లో బంతి మెరుపు కోసం లాలాజలం బదులు తడి తువాలు వినియోగం ఉత్తమమని దక్షిణాఫ్రికా పేసర్​ లుంగి ఎంగిడి అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. యానిమేషన్ చిత్రాల వైపు రానా

'బాహుబలి'లో భల్లాల దేవ పాత్రతో అంతర్జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ఇటీవలే నిర్మాతగా కూడా మారిన ఈ హీరో.. చిన్నపిల్లల కోసం యానిమేషన్​ చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details