ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందు వరిగడ్డి దగ్ధం

By

Published : Nov 8, 2020, 9:46 PM IST

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కుమ్మరికుంట్ల వద్ద విద్యుత్​ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​లో తరలిస్తున్న వరిగడ్డి ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు తగిలి దగ్ధమైంది.

ectric-shock-d
ectric-shock-d

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం.. కళ్లముందే దగ్ధమైన వరిగడ్డి

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వల్ల ట్రాక్టర్‌పై తరలిస్తున్న వరిగడ్డి దగ్ధమైంది. గ్రామానికి చెందిన చంద్రయ్య అనే రైతు వ్యవసాయ భూమి నుంచి ట్రాక్టర్‌ ద్వారా 70 కట్టల వరిగడ్డిని తరలిస్తున్నారు.

అయితే ఎస్సీకాలనీ వద్ద గడ్డి ట్రాక్టర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన డ్రైవర్‌ ట్రాలీని పైకెత్తి మండుతున్న గడ్డిని కిందకు పడేశారు. కాగా సుమారు రూ.10 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details