ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానితో కలిసి చంద్రయాన్​ను వీక్షించనున్న "నమృత" ఎవరో తెలుసా?

చంద్రయాన్ ​- 2 చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువవుతోంది. ఆ సన్నివేశాన్ని చూసేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటివారిలో ఓ తెలుగమ్మాయికి.. అరుదైన అవకాశం దొరికింది. అది ఎంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

By

Published : Aug 31, 2019, 12:52 PM IST

chandrayan

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన విద్యార్థిని నమృతకు... అరుదైన అవకాశం లభించింది. చంద్రయాన్​ - 2 రోవర్...​ చంద్రుడిమీద దిగే సన్నివేశాలను ప్రధాని మోదీతో కలిసి ఆమె వీక్షించనుంది. కోదాడలోని తేజ పాఠశాలలో నమృత 8వ తరగతి చదువుతోంది. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేయగా... తెలంగాణ నుంచి నమృతకు ఆ అవకాశం దక్కినట్టు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details