ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 27, 2019, 3:21 PM IST

ETV Bharat / city

'తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు'

తెలుగు ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వెలుగుల పండుగనాడు ప్రతిఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే భారతీయ సంప్రదాయంలో... దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి దీపాలను ఇంటింటా వెలిగించి శుభాలు ఆహ్వానించే ఈ పండుగను... ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపం జ్ఞానానికి, ఆనందానికి, ప్రగతికి చిహ్నమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ప్రతి ఇంటా నిండిన వెలుగులు ఇంటిల్లిపాదికీ జీవితమంతా నిత్య సంతోషాలను పంచుతూ... శాశ్వతంగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి...గన్నవరం రాజకీయం... గరంగరం

ABOUT THE AUTHOR

...view details