ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2020, 12:18 PM IST

ETV Bharat / city

'ఆరోపణలు నిరూపించండి.. రాజధానిగా అమరావతే ఉంటుంది'

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను తానే అభివృద్ధి చేశానని అన్నారు.

chandrababu interview to ani
chandrababu interview to ani

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి రాజధాని కోసం తమ పోరాటం ఆగదన్నారు.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. రాయలసీమకు ఎవరు ఏంచేశారో ఒకసారి చరిత్ర చూసుకోవాలని.. జాతీయ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. తాను రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ అన్నీ వెళ్లిపోతున్నాయని ఆవేదన చెందారు. రాయలసీమకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏంచేశారో ఆలోచించుకోవాలని వైకాపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేను రాయలసీమ నుంచే వచ్చా... అభివృద్ధి చేసింది నేనే.. అని స్పష్టం చేశారు. హెరిటేజ్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని.. ఆరోపణలు చేయడం కాదు... నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు. రాజధానిగా అమరావతే ఉంటుందని తేల్చారు.

ABOUT THE AUTHOR

...view details