ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

By

Published : Aug 7, 2020, 12:26 PM IST

నేతన్నలకు చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లాక్​డౌన్ కారణంగా నష్టపోయి.. తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

chandrababu
చంద్రబాబు

నేత కార్మికులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు 24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలన్నారు. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్‌ ఫండ్‌ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. నేతన్నల దగ్గరున్న సరకును కొనుగోలు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details