ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2019, 3:55 PM IST

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్​రెడ్డి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆలయాధికారులు మంత్రికి అందించారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో కిషన్ రెడ్డి

తిరుమల శ్రీవారి సన్నిధిలో కిషన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి తితిదే ఆధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయాధికారులు అందజేశారు. జమ్ము కశ్మీర్​ను పూర్తిగా వీలినం చేయడం సంతోషం కలిగిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ సంతోషంగా ఉండేలా మోదీ పాలన సాగుతోందన్నారు. మతం అనేది వ్యక్తిగతమని.. అయితే... సామూహిక మత మార్పిడీలను మాత్రం ప్రోత్సహించేది లేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details