ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అసెంబ్లీ నుంచి సీఎం వెళ్తుండగా మందడం వద్ద ఉద్రిక్తత

By

Published : Nov 30, 2020, 5:47 PM IST

ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో రాజధానిలోని మందడం దీక్షా శిబిరం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీక్షా శిబిరంలోని రైతులు రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అసెంబ్లీ నుంచి సీఎం వెళ్తుండగా మందడం వద్ద ఉద్రిక్తత
అసెంబ్లీ నుంచి సీఎం వెళ్తుండగా మందడం వద్ద ఉద్రిక్తత

సీఎం జగన్ అసెంబ్లీ నుంచి వెళ్తుండగా.. మందడం దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఇక్కడే ఉంచాలని తమ ఆకాంక్షను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి అడ్డంకులు ఎందుకని ప్రశ్నించారు. ఒక వేళ రైతులు రోడ్డుపైకి వస్తే ఉద్రిక్తత పెరుగుతుందని భావించిన పోలీసులు వారిని పూర్తిగా నిరోధించారు. ముఖ్యమంత్రి వెళ్తున్న సమయంలో మహిళలు, రైతులు జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details