ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2020, 7:47 PM IST

ETV Bharat / city

ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి రూ.436 కోట్లు విడుదల

రాష్ట్రంలోని ఆస్పత్రుల అభివృద్ధికి రూ.436.96 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు వీటిని కేటాయించింది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల బలోపేతానికే వీటిని వినియోగించాలని ఆదేశించింది.

Ap govt released 436 crore to hospital infra development
ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.436 కోట్లు జారీ


రాష్ట్రంలోని ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.436.96 కోట్లు విడుదల చేసింది. నవరత్నాల అమల్లో భాగంగా ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు ఈ నిధులు వినియోగించనుంది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల బలోపేతానికి నిధుల విడుదల చేసింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధికి తక్షణం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 3 ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.24.45 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని 89 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.399.73 కోట్లు జారీ చేసింది. ఒంగోలులోని మాతాశిశు ప్రభుత్వాస్పత్రికి రూ.1.76 కోట్లు, అనంతపురం సీడీహెచ్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.11.07 కోట్లు కేటాయించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details