ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యంగం మనది'

'రాజ్యాంగ దినోత్సవం' సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని నిలబెట్టే క్రమంలో దేశ ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.

By

Published : Nov 26, 2020, 10:18 AM IST

ap governor bishwabhushan on constitution day
ap governor bishwabhushan on constitution day

ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగం భారతదేశానిదని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 'రాజ్యాంగ దినోత్సవం' సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వం, సమానమైన రక్షణ కల్పించాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుందని గవర్నర్ అన్నారు.

రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, మాట్లాడే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని బిశ్వ భూషణ్​ అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details