ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వక్ఫ్​ బోర్డు ఆస్తుల లీజులను సవరించాలి'

By

Published : Jul 14, 2021, 2:24 PM IST

వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. బోర్డు ఆస్తుల లీజును ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందన్నారు.

ap deputy chief minister anjad basha
ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల లీజును ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఏపీ సచివాలయంలో మైనారిటీ సంక్షేమశాఖ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్, కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details