ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో... రూ.119 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని వచ్చే ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. కొందరు యూరియాను కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనంగా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. కల్తీ ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఇకపై ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేసే సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాతే విత్తనాలు సరఫరా చేయాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు రూ.7 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు: మంత్రి కన్నబాబు
వచ్చే నెల 15 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకీ ఏటా రూ.12,500 అందిస్తామన్నారు. ప్రకృతి విపత్తుల వలన నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. కేంద్రం నుంచి అదనపు యూరియా కోరినట్లు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ప్రకటించారు.
కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు : మంత్రి కన్నబాబు
ఇదీ చదవండి :