ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2020, 11:13 AM IST

Updated : May 10, 2020, 12:54 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

another-50-corona-positive-cases-in-the-state
రాష్ట్రంలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

11:06 May 10

రాష్ట్రంలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,66 నమూనాలు పరీక్షించగా 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1980కి చేరింది. కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 925 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1010 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 112కి చేరింది.  

ఇవీ చదవండి...గుంటూరు విధానం భేష్‌..!

Last Updated : May 10, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details