ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 16, 2021, 5:33 PM IST

ETV Bharat / city

తెలంగాణ: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి కాళేశ్వరం జలాల్లో గల్లంతైన ఘటన తెలంగాణలోని మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఆబోతుపల్లి చెక్‌డ్యామ్‌ వద్ద జరిగింది. అతని ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

a-man-was-fall-in-water-in-medak-distirct
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

తెలంగాణలోని కాళేశ్వరం జలాల్లో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు విడుదల చేశారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఆబోతుపల్లి చెక్‌డ్యామ్‌ వద్ద రావల్లికి చెందిన ముగ్గురు చేపల వేటకు వెళ్లారు.

చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు కిష్టయ్య అనే వ్యక్తి నీళ్లలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న కిష్టయ్యను తాడుతో కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఒడ్డుకు చేరువగా వచ్చిన కిష్టయ్య ఉన్నట్టుండి నీటిలో మునిగి గల్లంతయ్యాడు.

ఇదీ చదవండి:గుంటూరు జిల్లాలో లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details