ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

By

Published : Mar 1, 2022, 8:58 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు @9PM

  • 'కీవ్'​ లక్ష్యంగా దూకుడు పెంచిన రష్యా
    గతకొద్ది రోజులుగా ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్​ నగరమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కీవ్​-ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యా​ జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి
    ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉన్నత పదవులపై ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు.
    ఉన్నత పదవులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తాను ప్రజలకు దూరమయ్యానని, ఒకప్పటిలా తరచుగా అన్ని కార్యక్రమాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న ముగ్గురు విద్యార్ధులు
    ఉక్రెయిన్ నుంచి మరో ముగ్గురు తెలుగు విద్యార్ధులు ముంబైకి చేరుకున్నారు. విదేశాంగశాఖ సహకారంతో ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు చేరుకున్న వారిని.. ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వివేకా కేసులో జగన్ పాత్రపై విచారణ చేపట్టాలి: లోకేశ్​
    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శుభకార్యానికి వచ్చి నదిలో గల్లంతై ముగ్గురు మృతి..
    గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు వద్ద గల గుండ్లకమ్మ నదిలో.. ఈతకు దిగి గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 200 మంది మహిళలు.. 4000 నగ్నఫొటోలు.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ గలీజ్ దందా!
    చదివింది బీటెక్, ఎంబీఏ.. దిగ్గజ టెక్ సంస్థలో ఉద్యోగం.. చేసే పనులు మాత్రం నీచాతినీచం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది మహిళల్ని వేధించాడు. బెదిరించి 4వేల నగ్న ఫొటోలు సేకరించి.. విదేశీ అశ్లీల వెబ్​సైట్​లకు అమ్మేశాడు. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సత్య నాదెళ్ల కుమారుడు కన్నుమూత
    మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అతను కన్నుమూశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్​కు స్వర్ణం​
    అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్​ ఫెడరేషన్​ ప్రపంచకప్​లో భారత షూటర్​ సౌరభ్​ చౌదరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్​లో జర్మనీకి చెందిన మైకెల్​ స్క్వాల్డ్​పై 16-6 తేడాతో విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సర్కారు వారి పాట కొత్త పోస్టర్.. రవితేజ 'రామారావు' టీజర్
    మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 'సర్కారు వారి పాట', 'ఆర్​ఆర్​ఆర్​' 'సూర్య ఈటీ' చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. వాటిని మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details