- మరికాసేపట్లో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం, తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న వేళ... మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మాస్కు పెట్టుకోమంటే దారుణంగా కొట్టారు
నెల్లూరు టూరిజం కార్యాలయంలో ఉద్యోగినిపై దాడి చేసిన మేనేజర్ భాస్కర్ను మంత్రి అవంతి విధుల నుంచి తప్పించారు. తనపై మేనేజర్ను కావాలనే కొందరు ఉసిగొల్పారని.. మాస్కు పెట్టుకోమన్నందుకే తనను విచక్షణారహితంగా కొట్టారని బాధితురాలు ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్ర జలశక్తి నివేదికపై సమాధానమేది
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అవినీతి జరిగిందని పుస్తకాలు ముద్రించి రాద్ధాంతం చేసిన వైకాపా ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం కేవలం 20 శాతం పనులు పూర్తిచేసిందని ఆరోపించిన వైకాపా.. నవంబరులో 40 గేట్లు బిగిస్తామని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమిత్ షా ట్వీట్ ఫేక్
జమ్ము కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్ అని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సామూహిక ఖననం
ఇటీవల కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణపై పలు వార్తలు ఆందోళన కలిగించాయి. కొన్ని చోట్ల ఎలాంటి నిబంధనలు పాటించకుండా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటక బళ్లారి జిల్లాలో ఇది జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్డినెన్స్' రూపం