ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 17, 2021, 11:29 AM IST

ETV Bharat / city

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 247 కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 247 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు.

3 deaths and 247 new coronavirus cases in Telangana
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే తగ్గి... మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 247 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో 37 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,01,769కి పెరిగింది.

వైరస్‌కు మరో ముగ్గురు బలయ్యారు. ఇప్పటివరకు 1,659 మంది మహమ్మారితో మరణించారు. తాజాగా 158 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 2,98,009 మంది కొవిడ్​ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,101 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 716 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

ఇదీ చదవండి :కొడుకు చెంప దెబ్బ- తల్లి మృతి

ABOUT THE AUTHOR

...view details