ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 1PM

.

By

Published : May 23, 2020, 1:00 PM IST

1pm top news
1PM టాప్​ న్యూస్

  • సీఎంకు సీమ నేతల లేఖ

ముఖ్యమంత్రి జగన్​కు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా మొత్తం 16 మంది నేతలు లేఖ రాశారు. గోదావరి జలాలను సీమ ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అనుమతులు అవసరం లేదు

రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • పొగాకు రైతుల ఆందోళన

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో పొగాకు రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • గంజి నీళ్లే ఆధారం

విజయనగరం జిల్లా కురుపాం దగ్గరలో 3 రోజుల నుంచి జీడితోటలోనే వలస కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వారిని గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై కేసు

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించి ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లో దాదాపు 150 మంది ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు . విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • ఆ మందు వాడొద్దు

హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల పలు దుష్ప్రభావాలు కలుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ లింక్ చేయండి.

  • భారతీయుల వ్యక్తిగత సమాచారం హ్యాక్

సైబర్​ నేరగాళ్లు.. భారత్​లోని 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్​ ఫోరంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ప్రముఖ ఆన్​లైన్ నిఘా సంస్థ తెలిపింది. వీరంతా ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • భారత 'జ్యోతి'కి ఇవాంకా సలాం!

బిహార్‌ బాలిక జ్యోతి కుమారిని ప్రశంసించారు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్​. తండ్రిని కూర్చొబెట్టుకొని 1200 కి.మీ ప్రయాణించడం అద్భుతమని కొనియాడారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • గంభీర్-ఎమ్మెస్కే లొల్లి

టీమ్​ఇండియా సెలక్షన్ల విషయంలో మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్​ ఎమ్మెస్కే ప్రసాద్​ల మధ్య మాటల యుద్ధం సాగింది. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • సూర్య కోసం సత్యదేవ్

తమిళ నటుడు సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాలో సూర్య పాత్ర కోసం టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details