ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...

ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలకు ఉత్తర్​ప్రదేశ్​లోని పార్లమెంట్​ స్థానాల బాధ్యతలు అప్పగించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ.

By

Published : Feb 13, 2019, 6:27 AM IST

Updated : Feb 13, 2019, 7:12 AM IST

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...

యూపీపై కాంగ్రెస్​ దృష్టి...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఉత్తర్​ప్రదేశ్​లోని రాజకీయాలపై దృష్టి సారించింది కాంగ్రెస్​. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఇటీవలే ప్రియాంకగాంధీ, సింధియాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజాగా పార్లమెంటు స్థానాల బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

లోక్​సభలో అత్యధికంగా 80 ఎంపీ స్థానాలు ఉత్తర్​ప్రదేశ్​లో ఉన్నాయి. ఇందులో రాహుల్​ సోదరి ప్రియాంకగాంధీకి 41, జ్యోతిరాదిత్య సింధియాకు 39 స్థానాల బాధ్యతలు కేటాయించారు. ప్రస్తుతం ప్రియాంక తూర్పు ఉత్తర్​ప్రదేశ్​, సిందియా పశ్చిమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రాజధాని నగరమైన లఖ్​నవూతో పాటు అమేథీ, రాయ్​బరేలీ, సుల్తాన్​పుర్​, గోరఖ్​పుర్​, వారణాసీ, ఫూల్​పుర్​​, అలహాబాద్​, కుశీనగర్​ల బాధ్యతలు ప్రియాంక గాందీ చూసుకోనున్నారు.

సహారన్​పుర్​, కైరానా, ముజఫర్​నగర్​, మొరాదాబాద్​, ఘజియాబాద్​, ఫిలిభిత్​, కాన్పుర్​, ఫరూఖాబాద్​లు సింధియాకు కేటాయించారు. సోమవారం రోజు ప్రియాంక, సింధియాలతో పాటు రాహుల్​గాంధీ ఇక్కడ భారీ రోడ్​షో నిర్వహించారు. ర్యాలీ విజయవంతం కావటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

Last Updated : Feb 13, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details