ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీకి జైకొట్టిన ములాయం

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలంటూ లోక్​సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ములాయం సింగ్ యాదవ్​.

By

Published : Feb 13, 2019, 6:47 PM IST

మోదీకి జైకొట్టిన ములాయం

లోక్​సభ సమావేశాల చివరిరోజున సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్​ చేసిన వ్యాఖ్యలతో విపక్ష నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. భాజపా సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

"నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నా. ప్రస్తుత సభలో ఉన్న వారందరూ తిరిగి ఎన్నికవ్వాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు"
-ములాయం సింగ్​ యాదవ్​

ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తంచేస్తూ 'జై శ్రీరామ్'​ నినాదాలతో సభను హోరెత్తించారు భాజపా సభ్యులు.

ములాయం సింగ్ వ్యాఖ్యలను ఆశీర్వాదాలుగా భావిస్తున్నానని తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ.

భాజపా ఓటమే లక్ష్యంగా సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ ఉత్తరప్రదేశ్​లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సమయంలో ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ABOUT THE AUTHOR

...view details