మంత్రి ప్రత్తిపాటిని కలిసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే..వైకాపా నేతలు తెదేపాలోకి చేరుతున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
By
Published : Mar 13, 2019, 8:50 PM IST
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మంత్రి స్వగృహంలో ఎమ్మెల్యే ఏలూరి
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. చిన్నగంజాం మండలంలోని కార్యకర్తలు వీరి సమక్షంలో తెదేపాలో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు . తెదేపా విజయానికి సమష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు.