ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

లోడుతో వెళ్తున్న లారీలో మంటలు..సరుకు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో దగ్ధమైంది. అకస్మాత్తుగా అంటుకున్న మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చోదకుడి అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

By

Published : Jul 2, 2019, 12:55 PM IST

Updated : Jul 2, 2019, 1:06 PM IST

లోడుతో వెళ్లోన్న లారీలో మంటలు...సరుకు దగ్ధం

లోడుతో వెళ్తున్న లారీలో మంటలు..సరుకు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై సరకు రవాణా లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విశాఖ వైపు లోడుతో వెళ్తోన్న వి.ఆర్.ఎల్ లాజిస్టిక్స్ చెందిన లారీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కకు ఆపి కిందకి దిగాడు. ఇంతలో మంటలు వ్యాపించి లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా చెలరేగాయో వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jul 2, 2019, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details