ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'రాష్ట్రాభివృద్ధికి జగన్​ సహకరించకపోయినా ఫర్వాలేదు' - ap news

రాష్ట్రాభివృద్ధికి జగన్​ సహకరించకపోయినా..ఫర్వాలేదు కానీ అడ్డుపడవద్దని...తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోలవరంపై అవాస్తావాలు ప్రచారం చేస్తే..చరిత్రహీనుడుగా జగన్​ మిగిలిపోతారని పేర్కొన్నారు.

'రాష్ట్రాభివృద్ధికి జగన్​ సహకరించకపోయినా ఫర్వాలేదు'

By

Published : May 8, 2019, 9:46 AM IST

కడపలో తెదేపా సమావేశం

రాష్ట్రప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధికి జగన్​ అడ్డుపడవద్దని..తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, కడప ఆర్టీసీ జోనల్​ ఛైర్మన్​ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆక్షేపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీతో ప్రతిపక్షనేత చేతులు కలిపి పోలవరం ప్రాజెక్ట్​కు నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర పురోగతికి అడ్డుపడేలా ప్రవర్తిస్తే..జగన్​ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details