ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆప్ నేతృత్వంలో ఫిబ్రవరి 13న ప్రతిపక్షాల ర్యాలీ

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 13న దిల్లీ కేంద్రంగా ఆమ్​ఆద్మీ పార్టీ ఓ ర్యాలీని నిర్వహించనుంది. కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరు కానున్నాయి.

By

Published : Feb 10, 2019, 10:51 PM IST

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​లో ర్యాలీని నిర్వహించనుంది ఆమ్​ఆద్మీ పార్టీ. ఫిబ్రవరి 13న జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరుకానున్నాయి. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవనున్నారు.

తానీషా హటావో....దేశ్​ బచావో...

నియంత పాలనను తొలగించి దేశాన్ని రక్షించాలనే నినాదంపై ఈ ర్యాలీని నిర్వహిస్తోంది ఆమ్​ ఆద్మీ. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాకూటమిని సమీకరించేందుకు ఈ ర్యాలీని ఉపయోగించుకోనుంది ఆప్.

ABOUT THE AUTHOR

...view details