విజయవాడ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్లో అనుచిత పోస్టింగ్లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్పొరేటర్ శేషారాణి సీఎం జగన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వాట్సాప్ గ్రూప్లో సందేశం పెట్టారని వైకాపా కార్పొరేటర్లు కోపోద్రిక్తులయ్యారు. శేషారాణిపై చర్యలు తీసుకోవాలని సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
వాట్సాప్ గ్రూప్లో కార్పొరేటర్ దురుసు మాటలు
విజయవాడ కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్లో అనుచిత పోస్టింగ్లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దురుసుగా వాట్సాప్ గ్రూప్లో కార్పోరేటర్ మాట