ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'వైకాపాకు ఓటేస్తే ఊరికో రౌడీ తయారవుతాడు'

కోడికత్తి డ్రామా ఆడి తనపై వైకాపా అధ్యక్షుడు జగన్ నిందలు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్య కేసులో నాటకాలు ఆడారన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే ఊరికో రౌడీ తయారవుతాడని వ్యాఖ్యానించారు.

By

Published : Mar 20, 2019, 8:51 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు
వైకాపా అధినేత జగన్.. కోడికత్తి డ్రామా ఆడి తనపై నిందలు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక నాటకాలు ఆడారన్నారు. వైకాపాకు ఓటేస్తే రాష్ట్రంలో ఊరికొక రౌడీ తయారవుతాడని వ్యాఖ్యానించారు. ''మొన్న సీబీఐని తిట్టారు.. ఇవాళ ఏపీ పోలీసులను తిట్టారు. తెలంగాణ పోలీసులు ముద్దంటారు. ఆంధ్రా పోలీసులు వద్దంటారు'' అని విమర్శించారు.

అభివృద్ధికి కేసీఆర్ అడ్డు

ఉమ్మడి రాష్ట్ర ఆస్తులు విభజించకుండా తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్‌ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహించారు. పోలవరం ప్రాజెక్టుకు కేసీఆర్‌ అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డు పడినా పోలవరం ఆగదని... తనది ఉడుంపట్టు అని తెలిపారు. జగన్‌కు ఒక్కఓటు వేసినా.. మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని అన్నారు. తెదేపాకు.. విజయం ఏకపక్షం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో చంద్రబాబు పర్యటించారు. రాష్ట్రంలో అన్నివర్గాలనూ ఆదుకున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details